విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ: కాకినాడలో సోమవారం నుండి ఈనెల 10 వరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం కాగా అనంత జిల్లా అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి కుల్లాయి స్వామి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ .. సమాజంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడం, విద్యా వికాస, చట్టాలపై అవగాహన, దేశ సమగ్రాభివృద్ధికి చేయూతనిచ్చేందుకు చైతన్యపరిచేందుకు తరగతులు మేలుకొలుపుతాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నీ పరీక్షను వెంటనే రద్దు చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలుపరిచి, డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ విధానాన్ని,పీజీ విద్యార్థులకు కామన్ ఎంట్రెన్స్ రద్దుచేసి ఆఫ్లైన్ విధానాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 5045 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యా దీవెన, వసతి జీవన, కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు నరసింహ ,అంజి, వెంకట నాయక్ , వంశీ మంజు, సాయి స్వరూప హరికృష్ణ, ఆనంద్ సమీర్ వినోద్ ,అఖిల్ ,శివమణి పాల్గొన్నారు.