విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. గురువారం మంచోది శాంతిరాజు కుటుంబానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి తరుపున 25 వేలు, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, మాజీ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, బ్రహ్మయ్యల తరపున 10 వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు, రామలింగారెడ్డి, రవిచంద్రా రెడ్డి, శివరామరెడ్డి లు 15 వేలు మొత్తం 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహాయాన్ని అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అలాగే వైసీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్, సుందరం తదితరులు పాల్గొన్నారు.