విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : శనివారం ప్రపంచ జూనోసిస్ రోజు సందర్భంగా బహుళార్థ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచిత రక్షా రేబీస్ టీకాలు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్య్రక్రమంలో జంతువులు నుండి మనుషులకి సంక్రమించే వ్యాధుల గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెంపుడు కుక్కల యాజమానుల కు అవగాహన కల్పించడం జరిగింది . ఈ సందర్భంగా జిల్లా సంయుక్త సంచాలకులు డా.వై.వి.రమణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేడు అన్ని పశువైద్యశాలల్లో ఈ టీకాలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డా.జి.మహాలక్ష్మి , మున్సిపల్ కమీషనర్ విజయనగరం మల్లయ్య నాయుడు, అదనపు డి. ఎం.హెచ్ ఓ శ్రీ సూర్యనారాయణ గారు, సహాయ సంచాలకులు మరియు పశు వైద్యులు పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు .