సీఎం జగన్
ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కాన్సన్ట్రేటర్లు, డీటైప్సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, పీహెచ్సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలన్నారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని, ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.