కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు కార్యకలాపాలు మునుపటిలాగానే యథావిధిగా కొనసాగుతాయి.