మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యం లో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర చేస్తున్న ఆయన తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. ఈటల రాజేందర్కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచనమేరకు ఈటలను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పాదయాత్రకు మూడు, నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.