Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 74,820 నమూనాలు పరీక్షించగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడిన 2,737 మంది చికిత్సకు కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో ఐదుగురు, చిత్తూర్‌ జిల్లాలో నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,95,2513కు పెరిగాయి. ఇవాల్టి వరకు 1,91,6914 మంది చికిత్సకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22358 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం 13,241 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img