ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, అవంతి శ్రీనివాస్ హజరయ్యారు. అంతకముందు వైఎస్ఆర్, వంగవీటి రంగా విగ్రహాలకు మంత్రులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందన్నారు.