మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు.తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దిరెడ్డి అనుచరులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ాాపెద్దిరెడ్డి.. నేను.. కలిసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రస్థానం ప్రారంభించి ఆపార్టీలో మంత్రుల స్థాయి వరకు ఎదిగామని పేర్కొన్నారు.