కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా శ్రీ పి.కోటేశ్వరరావు నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ గారికి పలువురు జిల్లా ప్రముఖులు అభినందనలు తెలిపారు.