Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైఎస్‌ షర్మిలకు షాక్‌

ఇద్దరు కీలక నేతలు రాజీనామా
వైఎస్సార్‌ టీపీలో అప్పుడే అసమ్మతి రాగం వినపడుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కీలక నేతలు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి వైఎస్‌ఆర్‌టీపీకి గుడ్‌బై చెప్పారు.ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి ఇద్దరు నేతలు పంపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్సార్‌ టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. జిల్లాలో కీలక నేతగా కేటీ నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో కీలక నేతలు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img