‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ హన్సిక మోత్వాని. గత కొంతకాలంగా తెలుగు వెండితెరకు దూరమైంది. రీసెంట్గా ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్ థ్ల్రిలర్ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిదని చెప్పారు. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్ని ప్రారంభిస్తామని చెప్పారు.