సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ను వీక్షించవచ్చు. జూలై 31 లోపు ఫలితాలను ప్రకటించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం విడుదల చేసింది. 10వ తరగతి, 11వ తరగతి, ప్రీ-బోర్డ్ పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఫలితాలను విడుదల చేశారు.పదవ తరగతి పరీక్ష ఆధారంగా 30 శాతం మార్కులు, 11వ తరగతి ఆధారంగా 40 శాతం మార్కులు 12 వ తరగతి యూనిట్, మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల ఆధారంగా మార్కులు నిర్ణయించారు.