Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఔరంగజేబుపై ఫేస్‌బుక్‌ పోస్ట్‌

రెచ్చిపోయిన అల్లరిమూక
ముంబై: మొఘల్‌ చక్రవరి ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక పోస్ట్‌పై అల్లరిమూక రెచ్చిపోయి రాళ్లు రువ్విన ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ సిటీలో చోటుచేసుకుంది. వాహనాలు, హోర్డింగ్‌లపై అల్లరిమూక రాళ్లు రువ్వడంతో వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించిన నలుగురు పోలీసులు గాయపడ్డారు. విజయ్‌ చౌక్‌ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు బుధవారంనాడు తెలిపారు. ‘’ఒక హోర్డింగ్‌, పోలీసు వాహనం, ఆటో రిక్షాను అల్లరి మూక ధ్వంసం చేసింది. అల్లర్లను నియంత్రించేందుకు ప్రయత్నించిన ఒక పోలీసు అధికారితో సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు’’ అని ఉస్మానాబాద్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ బుద్ధ్వంత్‌ తెలిపారు. 43 మందిపై కేసు నమోదు చేశామని, గుర్తుతెలియని మరో 150 నుంచి 170 మందిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని మరో అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img