లక్నో : యూపీలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల జేబులును గుల్ల చేస్తోందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ పార్టీ ఒక అపద్దాల పువ్వు అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తును ఎగతాళి చేస్తూ మంగళవారం హిందీలో ట్వీట్ చేశారు. గత ప్రభుత్వాలు పేదల బ్యాంకు ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు జమచేశాయని అందుకు భిన్నంగా ఇప్పుడున్న బీజేపీ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. జేబు దొంగగా మారిన ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.