Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

కొత్తగా 6,996 పాజిటివ్‌ కేసులు, నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఒక్కరోజే 7 వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 38,055 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,996 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,17,384కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ వల్ల విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14514కు చేరింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,066 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 20,66,762కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,19,22,969 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్కరోజులో 1,534 వెలుగుచూశాయి. విశాఖలో కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. జిల్లాలో కొత్తగా 1263 కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img