Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జల్లికట్టు పోటీలు ప్రారంభం

ప్యారీస్‌(చెన్నై): పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశుసంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో ఉన్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, మెయ్యనాధన్‌, జిల్లా కలెక్టర్‌ కవితా రాము తదితరులు జల్లికట్టును లాంఛనంగా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img