Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణ పోలీస్‌ శాఖపై కరోనా పంజా

ఒక్కరోజే 72 మంది పోలీసులకు కొవిడ్‌
తెలంగాణ పోలీస్‌ శాఖపై కరోనా పంజా విసిరింది. నగరవ్యాప్తంగా ఉన్న పలు పోలీస్‌స్టేషన్‌లలో కలిపి 72 మంది పోలీసులు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా హైదరాబాద్‌ సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల సైబర్‌ క్రైమ్‌ బృందం ఓ కేసు విషయంలో రాజస్థాన్‌ వెళ్లి వచ్చింది. ఆ బృందంలోని ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img