Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు

కొత్తగా 2.58 లక్షల కరోనా కేసులు
దేశంలో కొవిడ్‌ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. తాజాగా 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. నిన్న కొవిడ్‌ కారణంగా 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ది. ప్రస్తుతం దేశంలో 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,51,740 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,53,37,461 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.27 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,73,80,253 కి చేరగా.. మరణాల సంఖ్య 4,86,451కి పెరిగింది. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 6.02 శాతం పెరిగి 8,209కు చేరింది. దేశవ్యాప్తంగా కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 39 లక్షల డోసులు పంపిణీ చేశారు. కాగా.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, ఢల్లీిలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న 41,327 కొత్త కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి. 29 మంది ఈ మహమ్మారితో మరణించారు. దిల్లీలో ఆదివారం 18,286 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img