Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ దాదాపు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 441 మంది మృతి చెందారు. 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,31,000కి చేరింది. కోవిడ్‌ రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. మరోపక్క దేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 8,961కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడిరచింది.ఇక నిన్న 76,35,229 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 158 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్నటివరకూ 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి 3.7 కోట్ల డోసులు ఉండగా, 56,66,263 ప్రికాషనరీ డోసులను కేంద్రం పంపిణీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img