Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

పంజాగుట్ట గ్ర్రేవ్‌ యార్డ్‌కు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ట్రాఫిక్‌ సమస్య శాశ్వత పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ నుండి 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్‌ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. గ్రేవ్‌ యార్డ్‌ కు నూతనంగా నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, పంజాగుట్ట గ్రేవ్‌ యార్డ్‌ కు నూతనంగా నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి పోతాయని చెప్పారు. పాత గేట్‌ నుండి హైటెన్షన్‌ విద్యుత్‌ పోల్‌ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్‌ నుండి కే.బి.అర్‌ పార్క్‌ జంక్షన్‌ కు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. సీఎం కెసిఆర్‌ ఆదేశాలు మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో హైదరాబాద్‌ మహా నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం నూతనంగా అండర్‌ పాస్‌ లు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ల నిర్మాణం, పుట్‌ పాత్‌ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయని అన్నారు. అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోని ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌ మహా నగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, కార్పొరేటర్‌ మన్నే కవితారెడ్డి, సీఈ దేవానంద్‌, ఎస్‌ఈ రవీందర్‌, డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img