Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రకాశం జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం

ఏపీలో ప్రకాశంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒక్కరోజులోనే 17 మంది పాఠశాల సిబ్బందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. బాధితులలో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు.. ప్రస్తుతం బాధితులు హోం ఐసొలేషన్‌ లో చికిత్స పొందుతున్నారు.ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, సింగరాయకొండ, టంగుటూరు, కొణిజేడు, పంగులూరు, యద్దనపూడి మండలాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు డీఆర్‌ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి చొప్పున కరోనా సోకింది. ఇక ఒంగోలు కేంద్రీయ విద్యాలయం, మార్కాపురం శారదా ఎయిడెడ్‌ స్కూల్‌, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్‌ స్కూళ్లలో ఒకొక్క టీచర్‌ కు కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img