తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రి వర్గం సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చిస్తోంది. కరోనా పరిస్థితులు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధతను మంత్రి హరీశ్రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వైద్యరోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. 30వతేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యాబోధన విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.