ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్కు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఏపీసీసీ అధినేత తెలిపారు. ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కొవిడ్ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని సూచించారు.