Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్‌ లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడిరచింది. ఈ నెల 24,26,28,31 తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రత్యేక రైలు (07295) రాత్రి 8.10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ, సికింద్రాబాద్‌ మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని పేర్కొంది. అలాగే ఈ నెల 25,27, 29 ఫిబ్రవరి 1న నాలుగు రైళ్లు లింగంపల్లికాకినాడ మార్గంలో నడుస్తాయని, సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి..మరుసటిరోజు ఉదయం 6.10 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img