Friday, April 19, 2024
Friday, April 19, 2024

సుప్రీంకోర్టులో పదిమంది జడ్జీలకు కరోనా


సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో పది మంది జడ్జిలకు కరోనా బారినపడ్డారు. సుప్రీంకోర్టులో మొత్తం 32 మంది జడ్జీలుండగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టులో కోవిడ్‌ పాజిటివిటీ రేటు 30 శాతానికి పెరిగింది.. జస్టిస్‌ కెఎమ్‌ జోసెఫ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధులకు హాజరు అవుతున్నారు. మిగతా ఎనిమిది మంది జడ్జీలు కరోనాతో క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో సుప్రీం కోర్టులో అత్యవసర కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటు చీఫ్‌ జస్టిస్‌కు ఎన్వీ రమణకు ఛాలెంజ్‌ గా మారింది. సుప్రీంకోర్టులో 1500మంది ఉద్యోగులుంటే వారిలో 400 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. సుప్రీంకోర్టు ప్రాథమిక వైద్యకేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా కరోనా సోకింది. వారం రోజుల్లో కరోనా సోకిన జడ్జీల సంఖ్య రెట్టింపు అయింది. సుప్రీంకోర్టులో కరోనా కేసుల వ్యాప్తితో కోర్టులు వర్చువల్‌ హియరింగ్‌ లు సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img