Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా గరిమెళ్ళ సత్యనారాయణ 72వ వర్ధంతి

ఘనంగా గరిమెళ్ళ సత్యనారాయణ 72వ వర్ధంతి

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్.
విశాలాంధ్ర ధర్మవరం; స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు తిరుగుబాటు చేయడానికి తెలుగులో పాటలను రచించిన మహాకవి కీర్తిశేషులు గరిమెళ్ళ సత్యనారాయణ 72వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చౌడప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గరిమెళ్ళ సత్యనారాయణ చిన్నప్పటి నుంచే పాఠశాలలోనే జానపద గేయాలు, శ్రమదోపిడి, ఆకలి చావులు, పోలీసుల అరెస్టులు, అంటరానితనము, దురదృష్టవశాత్తు వారు మరణించేటప్పుడు ఐదు సంవత్సరాలు కటిక పేదరికమును అనుభవించడం జరిగిందని తెలిపారు. వివిధ రకాల కథల రూపంలో ఉత్తేజపరిచిన మహోన్నత వ్యక్తి, ఆయన వారసత్వానికి సజీవుగా ఉంచడానికి 2020వ సంవత్సరంలో రాజమండ్రిలో శిక్షణ కళాశాలకు వారి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. నేటి విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, బొమ్మన్న, అజంతా కృష్ణ, సాకే వెంకటేష్, రామాంజనేయులు, దేవరకొండ నరసింహులు, షాకే వీరనారప్ప, పెద్దన్న, మల్లికార్జున, నాగార్జున, ఆదినారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు