గత వారం రోజులుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.44కు చేరగా, డీజిల్ రూ.93.17కు పెరిగింది. ఆర్థిక రాజధానిలో ధరలు చుక్కలనంటాయి. ముంబైలో పెట్రోల్ రూ.110.41, డీజిల్ రూ.101.03కు చేరాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.64గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 101.66గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.63 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.05 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.50 ఉండగా.. డీజిల్ ధర రూ. 101.97గా ఉంది.