ఆంధ్రప్రదేశ్లో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 88,149 నమూనాలు పరీక్షించగా, 2,498 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,41,327కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 23,843 ఉండగా.. 1904306 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న 2,201 మంది కోలుకున్నారు. కొవిడ్ బారినపడి 24 మంది మృతి చెందారు. చిత్తూర్లో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్లో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, కర్నూల్లో ఒక్క రు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,178కి చేరుకుంది. ఇక జిల్లాల వారీగా నమోదైన కేసులు పరిశీలిస్తే, అనంతపురం73, చిత్తూరు 245, తూర్పుగోదావరి 481, గుంటూరు 181, కడప 68, కృష్ణ 263, కర్నూలు 24, నెల్లూరు 233, ప్రకాశం 336, శ్రీకాకుళం 56, విశాఖపట్నం 179, విజయనగరం 33, పశ్చిమ గోదావరి 326 కేసులు నమోదయ్యాయి.