Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు


రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కార్యాలయాలు, ఇతర ఉపకార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి 5 గంటల వరకూ పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంతో పాటు విభాగాధిపతులు, కార్పోరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని పేర్కొంది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని తెలిపింది. అలాగే సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్లకు సంబంధించిన రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని వెల్లడిరచింది. ఈ మారిన సమయాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img