ప్రిన్సిపాల్ అనూప్
విశాలాంధ్ర -ధర్మవరం:: జూలై నెలలో జరుగుతున్న అంతర్జాతీయ టార్గెట్ పాల్ పోటీలకు పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు డి. తమ్మయి శ్రీ చరణ్.. పదవ తరగతి, ఏ. యశ్వంత్ కుమార్ పదవ తరగతి ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థులు జులై నెలలో 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు నేపాల్ లో జరుగుతున్న పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా 2024.. జనవరి 13, 14వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో జరిగిన నేషనల్ మీట్ లో ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ సాయికి ఎంపిక కూడా కావడం జరిగిందని తెలిపారు. ఈ విద్యార్థులను డైరెక్టర్, ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర బృందం, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.