శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం ; అన్నదానం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టపర్తి సత్యసాయి బాబా ఆశీస్సులతో 360 మందికి భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రి వైద్యులు సిస్టర్ల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు సేవ దాతగా సత్య సాయి సేవ సమితి వారు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాతలు మరి కొంతమంది ముందుకు వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని, ఇటువంటి బోధన సేవా కార్యక్రమం రోగులకు వరంలాగా మారిందని తెలిపారు. తదుపరి సత్యసాయి సేవా సమితి వారికి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.