హెడ్మాస్టర్ విజయ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థులందరూ క్రమశిక్షణతో కూడిన విద్యను తప్పక అభ్యసించాలని హెడ్మాస్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గొట్లురు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం చే మంజూరు కాబడిన స్కూల్ బ్యాగులు, పుస్తకాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యతోనే చిన్నారుల జీవితములో వెలుగులు వికసిస్తాయని తెలిపారు. ప్రభుత్వం చే 150 యొక్క మంది విద్యార్థులకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విద్యాసామాగ్రిని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రమౌళి రెడ్డి, చంద్రశేఖర్ రమీ జాబి తదితరులు పాల్గొన్నారు.