Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఆటగాళ్ల భద్రత కోసమే ఐదో టెస్టు రద్దు : గంగూలీ

న్యూదిల్లీ : ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దుపై విమర్శలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఘాటుగా స్పందించాడు. ఐపీఎల్‌ కోసమే ఈ మ్యాచ్‌ను రద్దు చేశారంటూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నాడు. ఆటగాళ్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.‘ఆటగాళ్లు ఆడటానికి తిరస్కరిం చారు. అలా అని వారిని నిందించడం సరికాదు. ఫిజియో యోగేశ్‌ ఆటగాళ్లతో బాగా సన్నిహితంగా ఉంటాడు. వారికి ప్రతిరోజు మసాజ్‌ చేస్తాడు. అతడికి కరోనా సోకిందని తెలియగానే ఆటగాళ్లు భయపడ్డారు. అందుకే ఆడనన్నారు. బీసీసీఐ బాధ్యతారహితంగా వ్యవహరించదు. మిగతా బోర్డులను గౌరవిస్తుంది. వచ్చే ఏడాది ఈ మ్యాచ్‌ను సింగిల్‌ మ్యాచ్‌ సిరీస్‌గా నిర్వహిస్తాం’ అని గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్‌`టీమిండియా మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన సంగతి విదితమే. అయితే ఐపీఎల్‌ కోసమే దీన్ని రద్దు చేశారంటూ ప్రత్యర్థి జట్టుకు చెందిన మాజీ ఆటగాళ్లు విమర్శించారు. ఆటగాళ్లు వైరస్‌ బారిన పడితే ఐపీఎల్‌ రెండో దశ సుజావుగా సాగదనే నేపథ్యంలో భారత ఆటగాళ్లు తప్పుకున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img