విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 02.07.2024ది. పది, ఇరవై రూపాయిల నాణాలకు రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ఐ.పి.సి. సెక్షన్ 124 ఏ ప్రకారం 10 & 20 రూపాయల నాణేలు చెల్లవు అనే విధంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు పని చేయవద్దని ఆర్.బి.ఐ. అధికారులు బహిరంగ ప్రకటన చేసారు. ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని హెచ్చరిక కూడా పంపారు. సోషల్ మీడియాలో పది రూపాయల నాణెం చెల్లదని, అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో అపనమ్మకం కలిగింది. భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 మరియు 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు మరియు వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై ఐ.పి.సి. సెక్షన్ 124 ఏ. కింద ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కేసులో మూడు ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని తెలిపారు.