Friday, June 9, 2023
Friday, June 9, 2023

మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసిన నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులు

కోర్టు ప్రాంగణంలో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు మరియు వారి మిత్రులు శుక్రవారం స్థానిక శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్నారాయణ ను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి స్వీట్లు అందజేశారు ఇటీవల బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజును మరియు ఇతర సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం పెనుకొండ కోర్టు నందు నెలకొన్న సమస్యలపై నాగరాజు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు కోర్టు ప్రాంగణంలో ఇప్పుడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు సబ్ కోర్టు నడుస్తున్నందున కోర్టుకు కోర్టు సిబ్బందికి కానీ న్యాయవాదులకు కానీ సరైన వసతులు లేవని నూతన భవనాలు నిర్మించాలని అలాగే కోర్టు ప్రాంగణంలో నెలకొన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు అలాగే ప్రభుత్వంతో చర్చించి అదనపు జిల్లా కోర్టు తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు కోర్టు ప్రాంగణమునందు పార్కింగ్ ప్లేస్ సిబ్బందికి తగిన భవనాలు లేవని కావున ఆఫీసు ఫైల్ పెట్టుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు లేవని వీటిపై వెంటనే శ్రద్ధ చూపాలని నాగరాజు ఎమ్మెల్యే కు విన్నవించారు వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు కృషి చేస్తానని పెనుకొండ కోర్టు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కనీస సదుపాయాలు కల్పించుటకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్నారాయణ న్యాయవాదులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రెటరీ క్రాంతి నాయక్ న్యాయవాదులు శ్రీనివాసులు శర్మ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img