Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంగరంగ వైభవంగా గద్దెరాల మారెమ్మ దేవి రథోత్సవం….

భక్తులు అమ్మవారికి వెండి కవచం వితరణ…

విశాలాంధ్ర-గుంతకల్లు : గుంతకల్లులో వెలసిన గద్దెరాల మారెమ్మ దేవి బ్రహ్మరథోత్సవం ఆదివారం భక్త జన సందోహం నడుమ వైభవంగా సాగింది.. పట్టణంలోని కథల వీధిలో వెలసిన గద్దెరాల మారెమ్మ దేవి అమ్మవారి మొక్కుబడిగా భక్తులు వెండి కవచాన్ని వితరణ చేశారు.అనంతరం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథం లోకి తీసుకువచ్చి అధిష్టింపజేశారు. అమ్మవారి విగ్రహానికి గజమాలతో విశేషంగా అలంకరణ చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు కౌన్సిలర్ వెంకటేష్, చిన్న మారెన్న ,లింగన్న ,మోతి ఆంజనేయులు, రుద్రాక్షల పెద్ద వెంకటేష్, పుల్లన్న, ఎల్లప్ప ,మహేష్ ,గిడ్డయ్య, రామలింగ మిటి సభ్యులు రథోత్సవ పూజ అనంతరం అమ్మవారి రథోత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు గుంతకల్ ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి రథోత్సవంలో పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి రథోత్సవం ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో అమ్మవారి నామస్మరణతో ప్రాంగణమంతా మార్మోగింది వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ అమ్మవారు బ్రహ్మరథంపై ఊరేగారు ఈ అమ్మవారి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు టూ టౌన్ సిఐ గణేష్ ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img