విశాలాంధ్ర ` బొమ్మనహళ్ : మండల కేంద్రమైన బొమ్మనహల్ ఎంఆర్సి కార్యాలయం లో భవిత సెంటర్ నందు శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ వన్నూరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ జే ఈ ఆర్ టి అశోక్ కుమార్ రెడ్డి హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో రిసోర్స్ సెంటర్ ఏర్పాటుచేసి వారంలో ఒకరోజు ఫిజియోథెరపి, స్విచ్ థెరపీ , ఇవ్వబడుతున్నాయి. మరియు బుద్ధిమాన్యత కలిగిన పిల్లలకు, పిల్లలకు మాటలు చూపులేని పిల్లలకు మాటలు రాని చెవులు వినిపించిన పిల్లలకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నృత్య పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సూర్య కళ సిఆర్పి ఇస్మాయిల్ ఎంఆర్సి సిబ్బంది మల్లన్న మంజప్పా తదితరులు పాల్గొన్నారు