విశాలాంధ్ర -ధర్మవరం : ఓపెన్ టెన్త్ అడ్వాన్స్ టెన్త్ అంటూ ముందస్తుగా అడ్మిషన్లు చేసుకునేందుకు వివిధ రకాలుగా కోచింగ్ సెంటర్ల పేరుతో అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్న సాయి కృప జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ డీఏవో ఖతి జున్ కుప్రాకు మంగళవారం పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో అనుమతి లేని కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం విచ్చలవిడిగా ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కోచింగ్ సెంటర్లకు ఎలా అనుమతి ఇస్తారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇవాళ ఇష్టానుసారంగా ఫీజు దోపిడీలు చేస్తున్నారని వారు తెలిపారు. కావున ఇటువంటి కళాశాలలపై చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలబడాలని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీ వరకు ఎవరు కూడా అడ్మిషన్లు చేయరాదన్న ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు మురళి, జహీర్, మహమ్మద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.