Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తూ టిడిపి మండల కన్వీనర్ అరెస్ట్

మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు

రెండు వాహనాలు స్వాధీనం

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం డిఎస్పి హుస్సేన్ పీరా సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని తరలిస్తూ వ్యాపారం చేసుకుంటున్న వారి వివరాలు తెలియజేశారు శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మరువపల్లి క్రాస్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న టిడిపి మండల కన్వీనర్ సిద్దయ్య మరియు వారి అనుచరులు పట్టుబడినట్లు వారి నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 30 కేసుల మద్యాన్ని పట్టుకున్నట్లు వారు నుంచి ఒక కారు కె ఏ 41 ఏ 63 34 నెంబర్ గల కారులో మద్యాన్ని తరలిస్తుండగా అందులో టిడిపి కన్వీనర్ సిద్దయ్య మరియు భాష అనే వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనంలో ఏపీ 39 ఎంఆర్ 86 70 లో ముందుగా ఎస్కార్ట్ గా వెళుతూ అనుమానం రాకుండా వెళ్తూ ఉండేవారు వెనకాల మధ్యమున్న వాహనాన్ని తీసుకు వెళ్లేవారు వేరితోపాటుగా ప్రశాంత్ కుమార్ కృష్ణారెడ్డి అనే వ్యక్తులు కూడా అరెస్ట్ చేసామని వీరు ఎవరికైనా మద్యం కావాలంటే వీరికి తెలియజేసిన ఎడల కర్ణాటక కు వెళ్లి ఎవరికి తెలియకుండా మద్యం సరఫరా చేస్తూ ఉండేవారని ఇలాగే పోలీసులు కళ్ళు కప్పి అనేకమార్లు మద్యం తరలించినట్లు విచారణలో వెల్లడైందని వీరిని వెంటనే కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డిఎస్పి తెలిపారు . ఈ కార్యక్రమంలో పోలీసులు కష్టపడి కాపలా కాసి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నందుకు మారుతి, ఆదినారాయణ, భూమేష్, నాగరాజు నాయక్, లను డీఎస్పీ అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img