విశాలాంధ్ర/బొమ్మనహాల్ : కర్నూల్ లోని కార్మిక కర్షక భవనంలో శనివారం జరిగిన సమావేశానికి బొమ్మనహాల్ మండలం నుండి తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు అధికార ప్రతినిధి ఎస్పి నాగరాజు సమావేశంలో పాల్గొన్నారు అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపురం కేశవరెడ్డి అన్నారు కల్తీ పత్తి విత్తనాలు అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని కల్తీపత్తి విత్తనాల సరాపర చేసిన విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నష్టపోయిన ప్రతి రైతు కు ఎకరాకు 50 వేల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేసినట్లు కేశవరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కావలి రాము రమేష్ తదితరులు పాల్గొన్నారు