Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం.. అగ్నిమాపక అధికారి… యు. రాజు.

విశాలాంధ్ర -ధర్మవరం : అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి యు. రాజు శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముంబై ఓడరేవు నందు జరిగిన అగ్ని ప్రమాదమునందు దాదాపు 64 మంది అగ్నిమాపక సిబ్బంది తోపాటు వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందడం జరిగిందని దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలను రాష్ట్రమంతట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మొదటి రోజు శుక్రవారం అగ్నిమాపక కేంద్రంలో సిబ్బందిని సమావేశపరిచి, అగ్ని ప్రమాదాలలో మరణించిన సిబ్బందిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా గోడ పత్రికలు, కరపత్రాలను విడుదల చేయడం జరిగింది అన్నారు. ఈ వారం రోజులు పాటు ప్రజలలో అవగాహనను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులు శివరామిరెడ్డి, ముస్తఫా, హరినాథ్ రెడ్డి, రతచోదకులు- రవీంద్ర నాయక్, కృష్ణా నాయక్, కృష్ణమూర్తి, అగ్ని బటులు- ప్రకాష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు,మనోహర్, హరినాథ్ రెడ్డి, బాలకృష్ణ, వీరనారాయణ, హోంగార్డ్లు -, సతీష్ కుమార్, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img