Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అగ్నిమాపక అధికారి… యు. రాజు.

విశాలాంధ్ర -ధర్మవరం : అగ్నిమాపక ప్రమాదాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి యు. రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగు తోందని, ఇందులో భాగంగా రెండవ రోజు శనివారం పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల ఈజీ ట్రై అండ్ రిలయన్స్ ట్రేడ్స్ నందు పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా డెమో ద్వారా కూడా ప్రమాదాల నివారణ ఎలా చేయాలి అన్న ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి ఆర్టీసీ బస్టాండ్, కళాజ్యోతి సర్కిల్ నందు అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముంబై ఓడరేవు నందు జరిగిన అగ్ని ప్రమాదమునందు దాదాపు 64 మంది అగ్నిమాపక సిబ్బంది తోపాటు వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందడం జరిగిందని దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రమంతట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ వారం రోజులు పాటు ప్రజలలో అవగాహనను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులు శివరామిరెడ్డి, ముస్తఫా, హరినాథ్ రెడ్డి, రతచోదకులు- రవీంద్ర నాయక్, కృష్ణా నాయక్, కృష్ణమూర్తి, అగ్ని బటులు- ప్రకాష్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు,మనోహర్, హరినాథ్ రెడ్డి, బాలకృష్ణ, వీరనారాయణ, హోంగార్డ్లు -, సతీష్ కుమార్, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img