విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని సిరికల్చర్ కార్యాలయం ముందు మధ్యప్రదేశ్ నుంచి ధర్మవరం నకు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి రగ్గులు వ్యాపారం చేస్తున్నటువంటి వారి షాపు అనుకోకుండా మంగళవారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ తో రగులు అన్నీ కూడా పూర్తిగా దద్దమయ్యాయి. సమాచారం అందుకున్న అవార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు వారికి తక్షణ సహాయంగా పదివేల రూపాయల నగదును అందజేశారు. ప్రభుత్వం ద్వారా కూడా మరింత ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. బాధితులు ఎమ్మెల్యేకు, కౌన్సిలర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
కిడ్నీ బాధితునికి ఆర్థిక సహాయం: పట్టణంలోని గాంధీ నగర్ లో నివాసముంటున్న షకీలా కిడ్నీ సమస్యతో కొన్ని నెలలుగా బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని, ధర్మవరం నియోజకవర్గ సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ వారి ఇంటికి వెళ్లి తనవంతుగా 10,000 రూపాయల నగదును తండ్రి ప్రక్రుద్దీన్ కు అందజేశారు. బాధితులు దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు.