Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అధ్యాపకులు మంచి ఉత్తీర్ణతకు కృషి చేయండి.. డివి ఈవో రఘునాథరెడ్డి

విశాలాంధ్ర`ధర్మవరం : అధ్యాపకులు జూనియర్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను మంచి ఉత్తీర్ణత వచ్చే విధంగా కృషి చేయాలని డివి ఈవో రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం నాడు- నేడు పనులను పరిశీలించి, ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యా సంవత్సరం సిలబస్సు రికార్డులను పరిశీలిస్తూ, సిలబస్‌ అనుకున్న ప్రకారం బోధన జరుగుతోందా? లేదా? అన్న విషయాలను కూడా అధ్యాపకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు అందరూ కూడా విద్యార్థులను వారి స్థాయిని బట్టి విభజించి మంచి అభ్యసన చేయించే పద్ధతిలో జరిగితే ఉత్తీర్ణత సాధ్యమవుతుందని తెలిపారు. గత సంవత్సరము కన్నా ఈ సంవత్సరం విద్యార్థుల నుండి మెరుగైన ఫలితాలు రావాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img