Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి లక్ష రూపాయలు విరాళం… ధర్మవరం యువర్‌ ఫౌండేషన్‌ సంస్థ

విశాలాంధ్ర`ధర్మవరం : అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి గుండె సమస్యలకు సంబంధించి యాజియోగ్రామ్‌ చేయుటకు ఉపయోగించే కాంట్రాస్ట్‌ ఇంజక్షన్లు కొరకు లక్ష రూపాయలు నగదును ధర్మవరం యువర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు హాస్పిటల్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ మైరెడ్డి,సూపర్డెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌ కు అందజేశారు. అనంతరం యువర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు, కార్యదర్శి సుకుమార్లు మాట్లాడుతూ పేద ప్రజలకు గుండెకు సంబంధించిన సమస్యలకు, యాంజియోగ్రామ్‌ చేయించుకొనుటకు ఈ ఇంజక్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. పేద ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ విరాళాన్ని ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్‌, ప్రిన్సిపాల్‌ తో పాటు వైద్యులు, సిబ్బంది యువర్‌ ఫౌండేషన్‌ సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపర్డెంట్‌ సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ శ్రీనివాస్‌ శౌరి, కార్డియాలజిస్ట్‌ సుభాష్‌ చంద్రబోస్‌, న్యూరాలజిస్ట్‌ రవి ప్రకాష్‌, యువర్‌ ఫౌండేషన్‌ కోశాధికారి రాధాకృష్ణ, డాక్టర్‌ సుబ్బారావు, పోలా ప్రభాకర్‌, చాంద్బాషా, రమేష్‌ బాబు, జయరాం, బండి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img