Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి వెంటనే నిధులు కేటాయించాలి-ఏఐఎస్ఎఫ్

  • విద్యార్థుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరి నశించాలి.
  • ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వినోద్

విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి వెంటనే నిధులు కేటాయించాలని ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వినోద్ డిమాండ్ చేశారు.శనివారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గాని, మంత్రులు గాని,ఎంపీలు గాని బిజెపికి దాసోహం చేస్తుందన్నారు.సెంట్రల్ యూనివర్సిటీకి నిదులు,ఆంధ్ర లో ఉన్న యూనివర్సిటీలు నిదులు విద్యార్థుల చదువు బడ్జెట్ కేటాయింపులపై చర్చించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ పట్టణ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్, పట్టణ నాయకులు రాజేష్, సురేష్, రాఘవ, హేమంత్, సోము, ప్రవీణ్ ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img