Friday, April 19, 2024
Friday, April 19, 2024

అనారోగ్యంతో గుత్తి తాహశీల్దార్ హాజివలి మృతి

విశాలాంధ్ర-గుంతకల్లు : గుత్తిలో తాహశీల్దార్ గా విదులు నిర్వహిస్తున్న హాజివలి బుధవారం అనారోగ్యంతో అనంతపురంలో కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో గుంతకల్లు మండల డిప్యూటీ తాహశీల్దార్ విధులు నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ నియోజవర్గం అధ్యక్షుడు గుంతకల్లు తాహశీల్దార్ బి.రాము ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా అనంతపురంలోని ఆయన నివాసానికి గుంతకల్లు యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img