Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తాం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీలక మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు జనసేన పార్టీ సమ న్యాయం చేస్తుందని, ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు 38, 39 వార్డు లలో పర్యటించారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు గడిచిన రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుటలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మా పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను, మైనారిటీ, బిసి, ఎస్సీలను, భవన కార్మికులను తదితర వర్గాల వారిని ఆదుకొని, తప్పక అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం తర్వాత దేశంలో రెండవ స్థానం ఉన్న చేనేత పరిశ్రమ నేడు కుంటుపడిందని, చేనేత కార్మికులకు జీవనోపాధి కూడా కష్టతరమైందని, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం, మోడీ సరుకులు ఆకాశాన్ని అంటడం లాంటివి జరిగాయని, దీంతో చేనేత కార్మికులు ఆకలి చావులు లేదా ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం అని తెలిపారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుందే తప్ప శాశ్వత పథకాల వారి అభివృద్ధికి బాట వేయలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడితే ప్రజలు స్వాగతిస్తారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img