విశాలాంధ్ర= పెనుకొండ : పట్టణంలో 10 వ రోజు అన్నాక్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు ఉచిత భోజన సదుపాయం అందించిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నాక్యాంటీన్ ద్వారా పేదలకు ఉచిత భోజన సదుపాయాన్ని అందించారు పట్టణలో అంబేద్కర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే అన్న క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ కి వచ్చినటువంటి పేషెంట్లు సంతలో కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ వద్దకు వచ్చి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పేదవాడి కడుపుకు పట్టెడన్నం పెట్టడానికి చేతులు రావడంలేదని తెదేపా నాయకులు విమర్శించారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రతి పేదవారి కడుపు నింపే విధంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెదేపా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో త్రివేంద్ర, సుబ్రహ్మణ్యం, వాసుదేవ రెడ్డి, హనుమంతు ప్రసాద్ ,దాదు, శివ నాయక్ ,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.